టిఆర్ ఎస్ ప్రభుత్వం బాలల హక్కుల కమిషన్ ఛెయిర్మన్ నియమాకం వివాదాస్పదమయింది. నియామకం మీద ఇపుడు హై కోర్టు స్టే ఇచ్చింది.

హైకోర్టులో తెలంగాణా ప్రభుత్వానికి దెబ్బ తగిలింది.

తెలంగాణ ప్రభుత్వం జరిపిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ నియామకం పై హైకోర్టు స్టే విధించింది.

నియామక విధానం చట్ట ప్రకారం జరుగలేదంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సంస్థకు ఛెయిర్మన్ గా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ని నియమించారు. ఆయన రాజకీయ నాయకుడు, టిఆర్ ఎస్ కార్యదర్శిగా కూడాపనిచేశారు. గత ఎన్నికలలో పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే, ఆయన పోటీ చేసే అవకాశం దొరకలేదు. అపుడు ఆయను ఈ కీలకమయిన రాజ్యాంగ సంస్థకు ఛెయిర్మన్ గా నియమించారు.

దీనిని బాలల హక్కుల పరిరక్షణ యాక్టివిస్టు, కమిషన్ మెంబర్ సవాల్ చేశారు.

కమిషన్ నియమావళి 3 ప్రకారం బాలల పరిరక్షణకు సంబంధించి కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించాలి. 

రూల్ 4 ప్రకారం సెలక్షన్ కమిటీ చైర్మన్ లేకుండా కమిషన్ చైర్ పర్సన్ నియామకం చేపట్టడం నిబంధనలకు విరుద్ధం.

గుడిమల్ల నియమాకం ఈ కారణాల వల్ల చెల్లదని పిటిషన్ అచ్యుత రావు పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి పిటిషన్ తరఫున కోర్టుకు హజరయ్యారు.

పిటిషనర్ వాదనతో హైకోర్టు.ఏకీభవించింది. తదుపరి ఉత్తర్వులు వెల్లువరించే వరకునియామకం మీద స్టే విధించింది. 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM