Telangana: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు రాష్ట్రంలోని పలు చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నదని ఆయన వెల్లడించారు.
Telangana: నర్సంపేట కమ్యూనిటీ ఆస్పత్రిని జిల్లా స్థాయి ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు పర్యటన.. ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా మార్చనుంది. రూ.58 కోట్లతో పట్టణంలో టి డయాగ్నోస్టిక్ సెంటర్, 25 ఆరోగ్య ఉపకేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర పనులను శనివారం నాడు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అలాగే, మెరుగైన వైద్యం కోసం ప్రజలు వరంగల్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా 330 పడకల ఆస్పత్రి మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏర్పాటయ్యే టీ డయాగ్నస్టిక్ సెంటర్లో ప్రజలకు ఉపయోగపడేలా 57 రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటు 26 ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అద్భుతంగా మెరుగుపడుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి సుదీర్ఘంగా మాట్లాడిన మంత్రి హరీశ్రావు.. మహారాష్ట్రలోని పొరుగు ప్రాంతాలకు చెందిన రైతులు తెలంగాణలో వ్యవసాయం చేసేందుకు చిన్నపాటి భూములు కొనుక్కోవడం తన దృష్టికి వచ్చిందని వివరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాజకీయ నాయకులు కూడా తెలంగాణకు భవిష్యత్తు ఉండదని చెప్పారని, అయితే ఏడేళ్లలో అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనువిందు చేసిందని గుర్తు చేశారు. అన్ని వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించేలా రాష్ట్రాలను ఒత్తిడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. FRBM కింద 25,000 కోట్లు.. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ ఆఫర్ను తిరస్కరించారు.. రైతుల నుండి విద్యుత్ ఛార్జీల వసూలులో తను భాగస్వామ్యం కానని ప్రకటించారని ఆయన అన్నారు.
రైతుబంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ వంటి అనేక పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచకపోయినప్పటికీ పాలకవర్గం అనేక చర్యలు తీసుకుంది. రైతులు ఆర్థిక సహాయం కోసం ఎప్పుడూ సిఫార్సులు పొందాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వం ముందస్తుగా రైతు బంధును చేపట్టింది.. ఇప్పటివరకు రూ. 50,000 కోట్లు పంపిణీ చేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎరువుల ధరల పెంపుపై బీజేపీ నేతలను, కాళేశ్వరం పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక బీజేపీ నేతల ప్రయత్నాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలను పెంచాలని బీజేపీ యోచిస్తోందని అన్నారు. అలాగే, రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించినందుకు గానూ రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన ప్రకటించారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ పరిపాలన సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు ప్రజలు త్వరలో బీజేపీపై పై తిరుగుబాటు చేస్తారన్నారు. ఉద్యోగాల కల్పనపై పార్టీ నాయకులు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు.
