Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో దారుణం: యువతిపై ప్రేమోన్మాది దాడి, యువతి మృతి

హైద్రాబాద్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  హఫీజ్ బాబా నగర్ లో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి దిగాడు. ప్రేమకు నిరాకరించిందనే నెపంతో నిందితుడు ఆమెపై కత్తితో దాడికి  దిగాడు.  ఈ డాడిలో ఆసుపత్రిలో చకిత్స పొందుతూ యువతి మరణించింది.

Habib Attacks On Woman with Knife In hyderabad
Author
Hyderabad, First Published May 27, 2022, 3:23 PM IST


హైదరాబాద్: నగరంలోని kanchanbagh పోలీస్ స్టేషన్ పరిధిలోని Hafizbaba nagar,నగర్ లో  శుక్రవారం నాడు యువతిపై కత్తితో ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.మహిళపై దాడి చేసింది Habib గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఓ రాజకీయ పార్టీలో హబీబ్  నాయకుడిగా పోలీసులు చెబుతున్నారు. 

ప్రేమను తిరస్కరించడంతోనే నిందితుడు ఇవాళ యువతిపై కత్తితో దాడికి దిగాడు. శుక్రవారం నాడు మథ్యాహ్నం యువతి నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నిందితుడు కత్తితో వచ్చి ఆమెపై దాడికి దిగాడు. కత్తి దాడితో కిందపడిన యువతి గాయాలతో కేకలు వేసింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఆమెను కాపాడేందుకు వచ్చారు. అయితే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో స్థానికులను బెదిరించాడు. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. ప్రేమను అంగీకరించలేదని యువతులపై దాడులు చేసిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఏడాదిలోపుగానే నిందితులకు శిక్షలు పడిన ఘటనలు కూడా ఉన్నాయి.  అయినా కూడా ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. 

ఈ ఏడాది ఏప్రిల్ 22న హన్మకొండలో  ఓ ప్రమోన్మాది  యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రేమించాలని యువతిపై  అజహార్  అనే యువకుడు కత్తితో ఇవాళ దాడి చేశారు. హన్మకొండలోని పోచమ్మకుంటకు సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. యువతిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.యువతి కాకతీయ యూనివర్శిటీలో చదువుతున్నట్టుగా  గుర్తించారు. నర్సంపేటకు సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతుంది.

పోచమ్మకుంట సమీపంలో కుటుంబంతో పాటు అనూష నివాసం ఉంటుంది. కొంత కాలం నుండి అజహర్  అనూషను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న  అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించి అజహర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. ఎంజీఎం  ఆసుపత్రికి తరలించారు.అనూష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు.  గొంతుకు లోతుగా గాయం కాలేదని చెబుతున్నారు. 

యువతిపై దాడికి దిగిన నిందితుడు అజహర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టుగా సమాచారం.  అయితే ఈ విషయమై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతపై యాసిడ్ దాడి చోటు చేసుకొంది. ప్రేమించలేదనే ఈ దాడి చోటు చేసుకొంది. 

also read:మంచిర్యాల జిల్లాలో దారుణం: కత్తితో యువతిపై ప్రేమోన్మాది దాడి

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని కారణంతో ఇంటర్ విద్యార్థిని గొంతుకోశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 21న చోటు చేసుకుంది. 

ఈ దారుణానికి పాల్పడిన ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతిపై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు.తనను ప్రేమించలేదని కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు. వెంటనే జ్యోతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios