Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాల జిల్లాలో దారుణం: కత్తితో యువతిపై ప్రేమోన్మాది దాడి

మంచిర్యాల జిల్లాలో సోమవారం నాడు ప్రేమోన్మాది యువతిపై దాడికి దిగాడు. ప్రేమించలేదని కిరణ్  గౌడ్ అనే యువకుడు కల్లు గీసే కత్తితో యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. 

kiran Goud Attacks With Knife on Woman In Mancherial District
Author
Hyderabad, First Published Apr 25, 2022, 6:52 PM IST

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో సోమవారం నాడు ప్రేమోన్మాది యువతిపై దాడికి దిగాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది.  మంచిర్యాల జిల్లాలోని Naspur లో యువతిపై Kiran Goud అనే యువకుడు knifeతో దాడికి దిగాడు. కల్లు గీసే కత్తితో యువతిపై దాడికి దిగాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రేమించడం లేదని కిరణ్ గౌడ్ ఆమెపై కత్తితో దాడికి దిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రేమోన్మాది దాడులు పెరిగిపోయాయి. 


ఈ నెల 22న ప్రేమోన్మాది  అజహర్  అనూష అనే యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రేమించాలని అనూషపై Azhar అనే యువకుడు కత్తితో  దాడి చేశారు. హన్మకొండలోని పోచమ్మకుంటకు సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. యువతికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు.. నర్సంపేటకు సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతుంది. కొంత కాలంగా అజహర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

పోచమ్మకుంట సమీపంలో కుటుంబంతో పాటు అనూష నివాసం ఉంటుంది.  ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న  అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించి అజహర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. ఎంజీఎం  ఆసుపత్రికి తరలించారు.అనూష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు.  గొంతుకు లోతుగా గాయం కాలేదని చెబుతున్నారు. 

యువతిపై దాడికి దిగిన నిందితుడు అజహర్ ను పోలీసులు శనివారం నాడు  అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చారు. ఈ ఘటనలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో నగేష్ అనే వ్యక్తి అనకాపల్లి జిల్లాలోని జి. మాడుగుల మండలంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద  స్వాతి  అనే యువతి గొంతు కోశాడు నగేష్  అనే యువకుడు. యువతి బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలో రెండు సార్లు యువతినిపై నిందితుడు బెదిరించాడని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కూతురిపై యువకుడి దాడి వెనుక తన సోదరుడి ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.  

యువతి మేనమామ కొండబాబు ఈ దాడికి సూత్రధారి అని బాధితురాలి తల్లి ఆరోపణలు చేస్తుంది. స్వాతి తల్లికి వారసత్వంగా వచ్చే ఆస్తి విషయమై సోదరుడు కొండబాబుతో ఉన్న విబేధాల కారణంగా ఈ దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  స్వాతిని హత్య చేస్తే నగేష్ కు లక్ష రూపాయాలు ఇస్తానని ఒప్పందం చేసుకొన్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. 

గతంలో కూడా తమ కూతురిపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా స్వాతి తల్లి చెబుతుంది.  స్వాతిపై దాడి చేసిన తర్వాత నగేష్ పారిపోయాడు. నగేష్ తో పాటు కొండబాబు కూడా పారిపోయినట్టుగా  సమాచారం. బాధిత కుటుంబం పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నగేష్, కొండబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios