జిహెచ్ఎంసీ ఎన్నికలు: బండి సంజయ్ కు హైదరాబాద్ పోలీసు అనుమతి
హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లేందుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి పోలీసులు అనుమతి ఇచ్చారు. తొలుత సంజయ్ కి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో గల భాగ్యలక్ష్మి అమ్వవారి ఆలయానికి వెళ్లడానికి పోలీసులు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం నిలిపేయాలంటూ తాను ఈసీకి లేఖ రాయలేదని, ఈ విషయంపై తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్ కూడా ఆలయానికి వచ్చి ఒట్టు వేయాలని బండి సంజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమ్వవారి ఆలయానికి వెళ్లడానికి
అయితే, తొలుత పోలీసులు ఆయనకు అనుమతి లేదని చెప్పారు. అయితే తర్వాత అనుమతి ఇచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన బండి సంజయ్ ఆలయానికి వస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది.
కాగా, హైదరాబాదు వరద బాధితులకు సాయం ఆపేయాలంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్ కు రాసినట్లు చెబుతున్న లేఖపై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వరద సాయాన్ని ఆపేయాలంటూ బిజెపి లేఖ రాసిందంటూ కేసీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని చెబుతూ ఆ విషయంపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు.
ప్రమాణం చేయడానికి తాను ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ఉంటానని బండి సంజయ్ చెప్పారు. అయితే, భాగ్యలక్ష్మి ఆలయంలోకి రావడానికి బండి సంజయ్ కు అనుమతి లేదని పోలీసులు తొలుత చెప్పారు. ఈ స్థితిలో బండి సంజయ్ అజ్ఢాతంలోకి వెళ్లారు. బిజెపి కార్యాలయం వద్ద పోలీసులు బారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయం చుట్టుపక్కల బారికేడ్లు వేశారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని వరద బాధితులకు సాయం నిలిపివేయాలంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాశాడని చెబుతున్న లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వరద బాధితులకు సాయం ఆపేయాలంటూ బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో బిజెపి చిక్కుల్లో పడింది.
సాయం నిలిపేయగానే వరద బాధితులు హైదరాాబదులోని పలు చోట్ల ఆందోళనకు దిగారు. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో బిజెపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖపై లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖపై ఉన్న సంతకాన్ని పోలీసులు పరిశీలించారు. లేఖను సర్క్యులేట్ చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నారు.
ఆ లేఖ తాను రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ఆ విషయాన్ని తేల్చుకుందామని ఆయన ఆయన కేసీర్ ను సవాల్ చేశారు.
బండి సంజయ్ ఈసీకి లేఖ రాయడం వల్ల వరద బాధితులకు సాయం అందించలేకపోతున్నామని, వరద సాయాన్ని బిజెపి అడ్డుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.