పండ్లు కొని డబ్బులు ఇవ్వమన్నందుకు వ్యాపారిని హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పండ్లు కొని డబ్బులు ఇవ్వమన్నందుకు వ్యాపారిని హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
శాకీబ్ అలీ(30) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 1న ఈ హత్య జరిగింది. ఆ రోజు ప్రగతి నగర్ రోడ్డులో బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటున్న శాకీబ్ వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి పండ్లను కొనేందుకు వచ్చాడు.
ద్రాక్ష పండ్లను కొన్నాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు వ్యక్తి నిరాకరించాడు. దీంతో కొన్న తరువాత పండ్లకు డబ్బులు ఇవ్వాలంటూ ఆ వ్యక్తిని శాకీబ్ అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన ఆ వినియోగ దారుడు మరో ముగ్గురితో కలిసి శాకీబ్పై దాడి చేశాడు.
ఈ దాడిలో శాకీబ్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తరువాత ఆస్పత్రిలో చేరిన శాకీబ్ అలీ చికిత్స పొందుతూ ఈనెల 3న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 4, 2021, 11:44 AM IST