తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది.

తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గురువారం ఫాక్స్‌కాన్ కంపెనీ ఛైర్మన్ యంగ్‌లియూ .. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.