మెట్ పల్లి మాజీ  ఎమ్మెల్యే  కొమిరెడ్డి రాములు   బుధవారంనాడు కన్నుమూశారు.  కొంతకాలంగా రాములు  అనారోగ్యంగా  ఉన్నారు.  

హైదరాబాద్: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు బుధవారంనాడు కన్నుమూశారు. కొంత కాాలంగా కొమిరెడ్డి రాములు అనారోగ్యంగా ఉన్నారు.. హైద్రాబాద్ ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మెట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి కొమిరెడ్డి రాములు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004-2009 వరకు ఆయన మెట్ పల్లి ఎమ్మెల్యేగా కొమిరెడ్డి రాములు కొనసాగారు. 2004లో పార్టీ టికెట్టు దక్కకపోవడంతో రాములు ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred