రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో దారుణం.. టాయిలెట్ లో పారేసిన పిండం లభ్యం
రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులోని టాయిలెట్ లో ఓ పిండం లభ్యమైంది. ఫ్లంబర్ వచ్చి టాయిలెట్ ను రిపేర్ చేస్తున్న సమయంలో ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణం జరిగింది. గ్రౌండ్ లెవెల్ మహిళల రెస్ట్రూమ్లో పారేసిన పిండాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన బుధవారం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు.
Harsh firing in wedding: పెళ్లి బరాత్ లో తుపాకీ పేల్చిన వరుడు.. ఊహించని ఘటనతో జైలు పాలు
పిండం లభ్యం కావడానికి ముందు ఆ రెస్ట్ రూమ్ ను ఎవరెవరు సందర్శించారు. అనుమానస్పదంగా కనిపించి వ్యక్తులను గుర్తించడానికి పోలీసుటు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా ఆ రెస్ట్ రూమ్ లో డ్రైనేజీని క్లియర్ చేయడానికి ఫ్లంబర్ ను పిలిచిన సమయంలో ఈ పిండాన్ని కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.“ మరుగుదొడ్డిని ఉపయోగించిన మహిళ గర్భస్రావం చేయబడిన పిండాన్ని ఫ్లష్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పిండం అవశేషాలను భద్రపరిచేందుకు దానిని బయటకు తీసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు పంపించాం. ’’ అపి అధికారులు తెలిపారు.
బాలికపై పెదనాన్న కుమారుడి అత్యాచారం, అది తెలిసి స్నేహితుడు కూడా..
ఇలాంటి ఘటనే గతేడాది సెప్టెంబర్ లో కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. లైంగికదాడికి గురైన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లోని టాయిలెల్ లో శిశువును ప్రసవించింది. ఆ పిండాన్ని అందులోనే ఫ్లష్ చేసింది. తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లాడ్ బజార్ గాజులకు జీఐ గుర్తింపు.. అధికారిక ప్రకటనే తరువాయి..
కొచ్చిలోని మైనర్ బాలికపై వయానాడ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు లైంగికదాడి చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. కానీ ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. ఆరు నెలలు నిండిన తర్వాత తన తల్లితో కలిసి వెళ్లి ఓ ప్రైవేటు హాస్పిటల్లో చెకప్ కోసం వెళ్లింది. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా ఆ మైనర్ బాలిక వాష్ రూం వెళ్లింది. అక్కడే బాత్ రూమ్లో ఆరునెలల శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత టాయిలెట్లోనే శిశువును ఫ్లష్ చేసింది. తర్వాత వెనక్కి వచ్చి ఇంటికెళ్లారు. ఆ టాయిలెట్లో శిశువు అవశేషాలు కనిపించడంతో సిబ్బంది పోలీసులకు విషయాన్ని చేరవేశారు. దర్యాప్తు తర్వాత ఆ బాలికే నెలలు నిండని శిశువుకు జన్మనిచ్చిందని తేలింది. తర్వాత ఆ బేబీని ఫ్లష్ చేసి మాయం చేయాలని భావించినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సదరు బాలికను ప్రశ్నించగా ఆమె ఈ పనిచేసినట్టు అంగీకరించింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.