భర్త లేని సమయంలో ప్రియుడిని కలవనీయడం లేదని..మామను...
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో మామను ఓ కోడలు ప్రియుడి చేత దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు పెద్ద కుమారుడు భాగయ్య సుమారు ఏడాదిన్నరగా బొబ్బిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో మామను ఓ కోడలు ప్రియుడి చేత దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు పెద్ద కుమారుడు భాగయ్య సుమారు ఏడాదిన్నరగా బొబ్బిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.
దీంతో మల్లేశం అప్పుడప్పుడు మల్లారెడ్డిపేట్లోని భాగయ్య ఇంటికి వస్తు పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భాగయ్య తండ్రి రాములు , అతని భార్య దేవమ్మలు మల్లేశంను, నవీనను పలుమార్లు హెచ్చరించారు.
దీంతో తన బంధానికి అడ్డుగా వస్తున్న మామను చంపాలని లేదంటే నీపేరు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మల్లేశం...రాములును ఎలాగైనా చంపాలని పథకం వేశాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్ 30న ఇంటికి ప్లాస్టింగ్ వేసేందుకు గాను మేస్త్రీ కోసం తన మామ మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు నవీన ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే అక్కడికి చేరుకున్న మల్లేశం.. రాములు దగ్గరికి వెళ్లి తన ఊళ్లో మేస్త్రీ కోసం వెళదామని చెప్పి మోటారు సైకిల్పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు. తన ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. రాములు మత్తులోకి వెళ్లిన తర్వాత అతన్ని చంపడానికి సాయం చేయాలంటూ తన మిత్రులను కోరాడు.
అందుకు వారు నిరాకరించడంతో అదే రోజు రాత్రి ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి రాములను మోటారు సైకిల్పై ఎక్కించుకున్నాడు. మల్లారెడ్డిపేట్కు వెళ్లే రోడ్డుకు ఎడమవైపు తీసుకెళ్లి ఇనుపరాడ్డుతో రాములు తలపైనా, శరీరంపైనా కొట్టాడు. అనంతరం చేతి రుమాలుతో గొంతుకు బిగించి చంపాడు. తన భర్త కనిపించడం లేదంటూ దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా కోడలే మామను ప్రియుడితో కలిసి హత్య చేయించిందని తేలింది.