Asianet News TeluguAsianet News Telugu

ఆ మహిళ నుంచి నా కొడుకుని కాపాడండి... హెచ్ఆర్సీలో ఓ తండ్రి ఆవేదన.. పోలీసులు ఏన్నారంటే..

19యేళ్ల యువకుడు.. 30యేళ్ల మహిళ ప్రేమలో పడ్డాడు. ఇంట్లోనుంచి వెళ్లిపోయి ఆమె దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఆ మహిళ వలలోనుంచి తన కుమారుడిని కాపాడమంటూ తండ్రి హెచ్చార్సీని ఆశ్రయించాడు.

father complints on a woman in HRC for son in hyderabad
Author
Hyderabad, First Published Aug 13, 2022, 12:43 PM IST

హైదరాబాద్ : ఓ మహిళ వలలో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడాలంటూ గచ్చిబౌలికి చెందిన ప్రైవేటు అధ్యాపకుడు ఒకరు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు (19) ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడని, స్థానికంగా ఉండే మహిళ (30) ప్రేమ పేరుతో అతడిని కొంగుకు కట్టేసుకుందని.. ఫిర్యాదులో పేర్కొన్నాడు. జూన్ 26న ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు ఇప్పటికీ రాలేదని వాపోయారు. స్థానిక  పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అబ్బాయి మేజర్ కాబట్టి తామేమీ చేయలేమని అంటున్నారని వివరించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జూలై 28న హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఎదురింటి బాలుడుని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్ మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న (30) తన ఎదురింట్లో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల జూలై 19న ఆ బాలుడితో  పరార్ అయింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వప్న, బాలుడు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడకు తీసుకువచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు.  బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.

ఆ మహిళ నుంచి నా కొడుకుని కాపాడండి... హెచ్ఆర్సీలో ఓ తండ్రి ఆవేదన.. పోలీసులు ఏన్నారంటే..

అయితే, ఆ మహిళ నలుగురు బిడ్డల తల్లి.. వయసు 30 ఏళ్లు.. ఇంటి ఎదురుగా ఉన్న 15 ఏళ్ల బాలుడు మీద కన్ను వేసింది. మాయమాటలు చెప్పి పోర్న్ వీడియోలు చూపించింది. అతడిని శారీరకంగా లొంగదీసుకుంది. విషయం బయటకు తెలిస్తే తమ సంబంధానికి ఇబ్బంది అని గుర్తించింది. ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ ఆ బాలుడు తో సహజీవనం మొదలుపెట్టింది.  బాలుడికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు.

హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించి వారిద్దరిని గుడివాడ తీసుకెళ్లారు. కేసు వివరాలను టూ టౌన్ సిఐ వి. దుర్గారావు బుధవారం వెల్లడించారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్ మన్ పేటకు చెందిన వివాహిత స్వప్న (30)కు నలుగురు పిల్లలు ఉన్నారు.  భర్తకు అనారోగ్య సమస్యలు ఉండడంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే 15 ఏళ్ల బాలుడితో స్వప్న చనువుగా ఉండేది. ఫోన్ లో నీలిచిత్రాలు చూపించేది.. అలా అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. అలా ఈ వ్యవహారం గుట్టుగా నెల రోజుల పాటు సాగింది. అయితే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే.. బాలుడు తనకు దూరమవుతోందని భావించిన స్వప్న పిల్లలు, భర్తను వదిలేసి ఈనెల 19న అతడిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios