తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఎస్ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఎస్ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ 40-50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్కు రూపాయి చొప్పున పెంచింది.
కాగా.. రాష్ట్రంలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు Erc కి డిస్కంలు tariff ప్రతిపాదనలను సమర్పించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.4,037 కోట్లను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు అంతర్గత సామర్ధ్యంతో పూడ్చుకొంటామని డిస్కం సంస్థలు ఈఆర్సీకి తెలిపాయి. 2021 డిసెంబర్ 1వ తేదీన discomలు ఈఆర్సీకి Arr లను సమర్పించాయి. 2021-22 ఏడాదికి గాను Electricity charges పెంపునకు గాను ప్రతిపాదనలు పంపాలని ఈఆర్సీ డిస్కంలకు వారం రోజుల గడువును ఇస్తూ 2021 డిసెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 28న చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాయి.
తెలంగాణలో 2022-23 లో రెండు డిస్కం కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఏఆర్ఆర్లను సమర్పించాయి. 2022-23 లో రూ.53,053 కోట్ల రెవిన్యూ అవసరం. రూ. 36, 474 కోట్ల రెవిన్యూ వస్తోందని డిస్కం కంపెనీలు అంచనా వేశాయి. రూ.5652 కోట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో వస్తాయని డిస్కం కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సుమారు రూ.10,928 కోట్ల రెవిన్యూ లోటు ఉంటుందని అంచనా వేశాయి
అయితే ఈ రూ. 10,928 కోట్ల రెవిన్యూ లోటును పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీల పెంపునకు గాను డిస్కం కంపెనీలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీసీకి ప్రతిపాదనలు అందించాయి.రూ.6831 కోట్లను చార్జీల పెంపు ద్వారా ఆర్జించాలని ప్రతిపాదనలను పంపాయి.గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూ. 1 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు చెప్పారు.
డొమెస్టిక్ కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి.ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ కింద అందించనున్నారు. అయితే ఈ సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అందించనుంది.
