బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్కతా ఈడీ విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది
బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్కతా ఈడీ విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది కోల్కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఇప్పటికే ప్రీతం కుమార్ అగర్వాల్ను ఈడీ అరెస్టు చేసింది. విదేశాలకు ఎగుమతి పేరుతో ఎంఎంటీఏసీ, ఎస్టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అగర్వాల్ అక్రమంగా దేశీయంగా వ్యాపారం చేసినట్లు అభియోగాలున్నాయి.
