హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మరో కారు బీభత్సం చేసింది. మెరుపు వేగంతో దూసుకొచ్చి డివైడర్ ను తగిలి పల్టీలు కొట్టింది. ఆ కారులో ముగ్గరు ఉన్నారు. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిత్యం లక్షల వాహనాలు తిరిగే.. చాలా రద్దీగా ఉంటే పంజాగుట్ట – బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఈ ప్రమాదం జరిగడం అదికూడా మెరుపు వేగంతో కారు నడపడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 మసీదు జంక్షన్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మరో కారు బీభత్సం చేసింది. మెరుపు వేగంతో దూసుకొచ్చి డివైడర్ ను తగిలి పల్టీలు కొట్టింది. ఆ కారులో ముగ్గరు ఉన్నారు. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

నిత్యం లక్షల వాహనాలు తిరిగే.. చాలా రద్దీగా ఉంటే పంజాగుట్ట – బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఈ ప్రమాదం జరిగడం అదికూడా మెరుపు వేగంతో కారు నడపడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 మసీదు జంక్షన్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది.

TS 09 EB 6049 నంబరు గల ఐ20 కారు.. వేగంగా దూసుకొచ్చి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే గతంలో రమ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంతో మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు అందరూ. బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ముక్ఫంజా కాలేజీ కి చెందిన విద్యార్థులలో ఒకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు పార్జత్ అలీ (19)గా, గాయపడిన వ్యక్తి బానిష్ (23) గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సోమాజిగూడ యశోద ఆసుపత్రి కి తరలించారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించారు. వాహనాన్ని అక్కడినుంచి తొలగించారు. కారులో చనిపోయిన వ్యక్తి ఎవరు.. మిగతా ఇద్దరు ఎవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.