Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కొత్త స‌చివాల‌యం నిర్మాణం వెనుకున్న క‌థేంటో తెలుసా..?

Hyderabad: ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అయితే, ఇప్ప‌టికే స‌చివాల‌యం వుండ‌గా, తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని ఎందుకు నిర్మించాలని నిర్ణయించుకుంది..?  సీఎం కేసీఆర్ ఎప్పుడు దీని గురించి ఆలోచించారు..? ఇలాంటి ప్ర‌శ్న‌లు, అంశాల వెనుక ఉన్న క‌థేంటో తెలుసా..? 
 

Do you know the story behind the construction of Telangana's new secretariat? RMA
Author
First Published Apr 30, 2023, 4:59 AM IST

Telangana's new secretariat: తెలంగాణ‌కు కొత్త సచివాలయ నిర్మాణం అనేది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయం నుంచే పాలన ప్రారంభించింది. అయితే అవసరమైన సౌకర్యాలు, క్యాంటీన్లు, పార్కింగ్ లేకపోవడంతో ఉద్యోగులు, సందర్శకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ లతో పాటు కాంక్రీట్ ప్యాచ్ లు, పైకప్పుల భాగాలు కూలిపోవడం ఉద్యోగులకు ముప్పుగా పరిణమించిన సందర్భాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి పాత సచివాలయ నిర్మాణ స్థిరత్వం, ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాణం పరిస్థితి బాగోలేదని సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సమగ్ర అధ్యయనం అనంతరం కమిటీ పలు లోపాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సిఫారసు చేసింది.

2019 జూన్ 27న కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నూతన సెక్రటేరియట్ కు డిజైనర్లుగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లు డాక్టర్ ఆస్కార్ జి.కాన్సెసావో, డాక్టర్ పొన్ని ఎం.కాన్సెసావో నియమితులయ్యారు. డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్ర‌యివేటు లిమిటెడ్ సంస్థకు కొత్త సచివాలయం నిర్మాణ కాంట్రాక్టు దక్కింది. 

భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటి వరకు రూ.550 కోట్లు ఖర్చు చేశామని, గతంలో వేసిన అంచనాల కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీని 6 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు.

మొత్తంగా తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభానికి సిద్ద‌మైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించ‌నున్నారు. వివిధ శాఖ‌ల మంత్రులు, అధికారులు త‌మ చాంబ‌ర్ల నుంచి పాల‌న ప‌నిచేయ‌నున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios