Asianet News TeluguAsianet News Telugu

థర్డ్ వేవ్ మీద శాస్త్రీయ ఆధారాలు లేవు.. డీహెచ్ శ్రీనివాసరావు

1-10 ఏళ్లలోపు పిల్లల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందన్నారు. కోవిడ్ బారిన పడినవారిలో 73శాతం మంది 20-60 ఏళ్లలోపు వారు ఉన్నారని చెప్పారు. 

dh srinivasa rao comments on covid third wave
Author
Hyderabad, First Published Sep 1, 2021, 3:40 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో 18 నెలల తరువాత స్కూళ్లు ప్రారంభం అయ్యాయని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. స్కూళ్లలో ఈ రోజు విద్యార్థుల హాజరుశాతం స్వల్పమేనన్నారు. కోవిడ్ కట్టడికి మొదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరణాల శాతం కేవలం 0.5 శాతం, రికవరీ రేటు 98.5శాతం ఉందన్నారు. 

1-10 ఏళ్లలోపు పిల్లల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందన్నారు. కోవిడ్ బారిన పడినవారిలో 73శాతం మంది 20-60 ఏళ్లలోపు వారు ఉన్నారని చెప్పారు. 

తెలంగాణలో బతుకమ్మ వంటి వేడుకలు జరిగినా కేసులు పెరగలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన పని లేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందన్నారు. థార్డ్ వేవ్ గురించి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios