Asianet News TeluguAsianet News Telugu

కవిత ఇంటికి చేరుకున్న న్యాయవాదులు: కాసేపట్లో రానున్న సీబీఐ బృందం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుండి సమాచారం సేకరించేందుకు  ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం  ఇవాళ  రానుంది. సీబీఐ అధికారులు రావడానికి ముందే  న్యాయవాదులు కవిత  ఇంటికి చేరుకున్నారు.

Delhi liquor scam: Advocates  Reached To  BRS MLC Kalvakuntla Kavitha Residence in Hyderabad
Author
First Published Dec 11, 2022, 10:25 AM IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి న్యాయవాదులు ఆదివారం నాడు ఉదయం వచ్చారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ అధికారులు కవిత నుండి సమాచారాన్ని సేకరించేందుకు రానున్నందున  న్యాయవాదులు  కూడా కవిత  ఇంటికి వచ్చారు.సీబీఐ అధికారులు కవిత నుండి సమాచారం సేకరించే సమయంలో న్యాయవాదుల కూడా ఆమె వెంట ఉండే అవకాశం ఉంది. సీబీఐ అధికారుల సమాచార సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు  గాను  ఓ ప్రత్యేక గదిని  ఏర్పాటు చేశారు
 కవిత. ఈ గదిలోనే  కవిత నుండి సీబీఐ అధికారులు సమాచారాన్ని సేకరించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సమాచారాన్ని సేకరించేందుకు  గాను  ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆదివారం నాడు రానున్నారు. సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స  నేతృత్వంలో  సీబీఐ బృందం  కవితను ఈ విషయమై సమాచారాన్ని సేకరించనున్నారు.  ఈ నెల 2వ తేదీన  ఈ విషయమై సీబీఐ అధికారులు కవితకు 160 సీఆర్‌‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

సీబీఐ అధికారుల  నోటీసు ఆధారంగా  కవిత  న్యాయ సలహా తీసుకున్నారు.  ఈ విషయమై  గత వారంలో  ప్రగతి భవన్ లో  కేసీఆర్ సమక్షంలో న్యాయ నిపుణులతో ఈ వవిషయమై నోటీసులపై చర్చించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు  ఈ విషయమై వ్యవహరిస్తుంది. 

సీబీఐ అధికారుల  నోటీసుల ఆధారంగా  ఈ నెల  6వ తేదీన  తన నుండి సమాచారం సేకరించేందుకు  కవిత అంగీకరించారు. ఈ నెల  3వ తేదీన  సీబీఐ అధికారులకు కవిత  ఓ లేఖ రాసింది,. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఎఫ్ఐఆర్ చార్జీషీటు పంపాలని  సీబీఐకి లేఖరాసింది.ఈ విషయమై సీబీఐ నుండి కవితకు సమాచారం అందింది. ఈ విషయమై న్యాయ నిపుణులతో  చర్చించిన  మీదట మరో లేఖను  కవిత  రాసింది.  ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో  తాను హైద్రాబాద్ లో ఉంటానని సీబీఐకి కవిత మరోసారి లేఖ రాసింది.సీబీఐ అధికారుల నుండి డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం  కవితకు  సమాచారం అందింది.  డిసెంబర్  11వ తేదీన ఉదయం  11 గంటలకు  తాము  సమాచార సేకరణకు వస్తామని  సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా  కవితకు సమాచారం పంపారు. దీంతో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు కవిత  ఇంటికి వచ్చి  సమాచారం సేకరించనున్నారు. 

 న్యూఢిల్లీ నుండి  సుమారు  ఎనిమిది మంది అధికారుల  బృందం  నిన్న హైద్రాబాద్ కు వచ్చింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత నుండి సమాచార సేకరణకు సీబీఐ అధికారులు రానున్నందున  బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ కూడ తన నివాసం వైపునకు  రావొద్దని   కవిత కోరారు. దీంతో  కవిత నివాసం పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా  మారాయి. కవిత నివాసానికి వచ్చే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ కవిత నివాసం వద్ద  పార్టీ శ్రేణులు  వచ్చేవారు.  ఇవాళ సీబీఐ అధికారులు సమాచారం సేకరించేందుకు రానున్నందున ఎవరూ కూడా రావొద్దని పార్టీ శ్రేణులను కవిత కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అమిత్ ఆరోరాను  ఇటీవలనే  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరును  ప్రస్తావించారు. ఈ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం కలకలం రేపింది. ఈ రిమాండ్ రిపోర్టు వెలుగు చూసిన తర్వాత  కవితకు  సీబీఐ అధికారులు  కవితకు  నోటీసులు పంపారు.  

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు సీబీఐ విచారణ: హైద్రాబాద్‌లో కవిత నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఆప్, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు   ఆరోపణలు చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది  రాష్ట్రాలకు చెందిన కొందరు కీలకంగా వ్యవహరించారని బీజేపీ నేతలు  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios