Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారులో దారుణం... జాలర్ల వలలో వివస్త్రగా మహిళ మృతదేహం

ఒంటిపై నూలుపోగు లేకుండా పూర్తి వివస్త్రగా, కాళ్లు చేతులు కట్టేసిన స్థితిలో ఓ మహిళ మృతదేహం హైదరాబాద్ శివారులోని ఓ చెరువులో లభించింది.  

dead body of woman has found in pond in hyderabad
Author
Hyderabad, First Published Jan 10, 2022, 10:43 AM IST

హైదరాబాద్‌: చెరువలో చేపలు పట్టడానిక వెళ్ళిన జాలర్ల వలలో ఓ మహిళ మృతదేహం పడిన సంఘటన హైదరాబాద్ (hyderabad) శివారులో చోటుచేసుకుంది. పూర్తి వివస్త్రగా కాళ్లు, చేతులు కట్టేసిన వున్న మహిళ మృతదేహాన్ని చూసి భయపడిపోయిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారుప్రాంతం నేరాలకు అడ్డాగా మారుతోంది. డ్రగ్స్ సప్లై ముఠాలతో పాటు కిడ్నాపర్లు, దొంగలు, రౌడీ మూకలు శివారు ప్రాంతాల్లో తిష్టవేసి నగరంలో నేరదందాను సాగిస్తున్న అనేక ఘటన ఇటీవల కాలంలో అనేకం వెలుగుచూసాయి. తాజాగా హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని ఓ చెరువులో ఒంటిపై నూలుగుడ్డ కూడా లేకుండా పూర్తి నగ్నంగా ఓ మహిళ మృతదేహాం బయటపడటం కలకలం రేపుతోంది. 

శామీర్ పేట (shamirpet) మండలం పొన్నాల్ గ్రామంలోని ఎర్రకుంట చెరువులో రోజూమాదిరిగానే కొందరు జాలర్లు చేపలు పట్టడానికి వెళ్లారు. చేపల కోసం చెరువులో వలవేయగా ఓ మహిళ మృతదేహం వలలో పడింది. బట్టలు లేకుండా వివస్త్రగా వున్న మహిళ మృతదేహాన్ని చూసి జాలర్లు భయపడిపోయారు. వెంటనే మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

శామీర్ పేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. కాళ్లు, చేతులు కట్టేసివుండి... పూర్తిగా వివస్త్రగా వున్న మహిళ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేసి హతమార్చి వుంటారని అనుమానిస్తున్నారు.

పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురయిన మహిళ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. 

ఇదిలావుంటే హైదరాబాద్ కోకాపేట పరిధిలోని పోచారం గుట్టల్లో మరో మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడి దాదాపు 15 నుండి 20 రోజుల క్రితమే హతమార్చి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కోకాపేట సెవెన్ హిల్స్ పోచారం గుట్టల్లో కుళ్లినస్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో క్లూస్ టీం, డాగ్ స్వాడ్ తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతురాలు ఎవరన్నది, ఎవరు చంపారన్నది తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు.

స్థానికంగా ఎలాంటి ఫిర్యాదుగానీ, మిస్సింగ్‌ కేసు కానీ నమోదుకాలేదని పోలీసులు వెల్లడించారు. ఇటీవల నగరంలో, రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలిస్తామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 మహిళ మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. దాంతో ముఖం గుర్తించలేకుండా మారడంతో మహిళను గుర్తించడం కష్టంగా మారింది.వేరే చోట మహిళను హతమార్చి ఇక్కడ శవాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 స్థానికంగా ఎలాంటి ఫిర్యాదుగానీ, మిస్సింగ్‌ కేసు కానీ నమోదుకాలేదని పోలీసులు వెల్లడించారు. ఇటీవల నగరంలో, రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలిస్తామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి ఎడమ చేతికి గాజు, కుడి చేతికి నల్లని దారం, రెండు కాళ్లకు పట్టాగొలుసులు, చెవులకు మాటీలు ఉన్నాయని పోలీసులు తెలిపారు, ఆనవాళ్లను బట్టి ఎవరైనా మహిళను గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు.
 
 

   

Follow Us:
Download App:
  • android
  • ios