Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : కోర్టులో ట్రయల్స్ ప్రారంభం.. హాజరైన 37 మంది నిందితులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు.

court trials starts in tspsc paper leak case ksp
Author
First Published Sep 15, 2023, 8:49 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ప్రాథమిక చార్జ్‌షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో 37 మందిని నిందితులుగా చేర్చారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. త్వరలో మిగతా నిందితులతో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా మిగిలిన అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. 

Follow Us:
Download App:
  • android
  • ios