కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. హైదరాబాద్లోని గాంధీభవన్లోని పోలింగ్ కేంద్రంలో.. తెలంగాణ పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాంధీ భవన్కు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్లో కాంగ్రెస్ అధ్యక్ష పదివి కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లోని పోలింగ్ కేంద్రంలో.. తెలంగాణ పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాంధీ భవన్కు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పీసీసీ ప్రతినిధులకు ఓటు వేసేందుకు ఏఐసీసీ ఓటర్ కార్డు జారీచేసింది. ఈ క్రమంలోనే జనగామ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డిలకు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఇద్దరు నేతలు ఓటు వేసేందుకు గాంధీ భవన్కు చేరుకున్నారు. మరోవైపు జనగామ నుంచి తనకు ఓటు వేసే అవకాశం ఉందని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు.
Also Read: కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, ప్రియాంక
అయితే ఓటరు జాబితాలో అఖరి క్షణాల్లో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు అనుమతించకపోవడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడంపై పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని పొన్నాల విమర్శించారు. న్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఇతరులు సముదాయించారు. ఈ పరిణామంతో జనగామ నియోజకవర్గం కాంగ్రెస్లో గత కొంతకాలంగా చోటుచేసుకున్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
అయితే ప్రస్తుతానికి ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా ఆపేశారు. ఈ విషయంపై ఏఐసీసీ ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలా ఉంటే.. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. ఇక, 24 ఏళ్ల తర్వాత గాంధీ కుబుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.
