వ్యాఖ్యల ఎఫెక్ట్: కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సోమవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసిందిః
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సోమవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసిందిః
మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఈ సంఘం చర్చించింది.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ గా పరిగణించింది. పార్టీని, రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి అవమానించారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది.
సంబంధిత వార్తలు
పీసీసీ క్రమశిక్షణ సంఘం భేటీ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ
బీజేపీలోకి కోమటిరెడ్డి: కాంగ్రెస్ నిర్ణయం తర్వాతే స్టెప్
బీజేపీ వైపు చూపు: కోమటిరెడ్డికి పీసీసీ నోటీసులు జారీ
బీజేపీ నేతలతో భేటీకి కోమటిరెడ్డి ఢిల్లీ పయనం