Chikoti Praveen: భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై దాడి చేసిన ఘటనపై క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ స్పందించాడు. భైరి నరేష్పై అయ్యప్ప భక్తులు, హిందూ వాదులు చేసిన దాడిని చికోటి సమర్ధించాడు.
Chikoti Praveen:అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి హన్మకొండ జిల్లాలో దాడి జరిగింది. ఈ దాడిపై క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ స్పందించాడు. భైరి నరేష్పై అయ్యప్ప భక్తులు, హిందూ వాదులు చేసిన దాడిని చికోటి సమర్ధించాడు. దాడి చేసిన వారికి పాదాభివందనాలు అంటూ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
'భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్పై దాడికి పాల్పడ్డ అయ్యప్ప భక్తులు, హిందూ సోదరులందరికీ పాదాభివందనాలు. ఇలాంటి కుక్కలు రోడ్డు మీద ఎక్కడ కనిపించినా .. తరిమితరిమి కొట్టాలి. ఇలాంటి దాడులు ఎవరు చేసిన వారి తరఫున నేనే స్వయంగా నిలబడతా.. వారి నా పూర్తి మద్దతు ఉంటుంది. నాకు భైరి నరేష్ కనిపించినా ..
పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతా.. ఎవరైనా హిందూ ధర్మంపై లేదా హిందూ దేవుళ్లు, దేవతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. వారిని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాం. హిందూ సోదరులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది' అని చీకోటీ అన్నారు. ఇలా భైరి నరేష్ లాంటి వ్యక్తులపై దాడి చేయాలని చికోటి ప్రవీణ్ పిలుపునిచ్చాడు.
ఇటీవల అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై భైరి నరేష్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీంతో ఆగ్రహాంతో ఉన్న కొంతమంది.. భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తీసుకెళ్తున్నారు. పోలీసులను అడ్డగించిన కొందరూ నరేష్ ని కిందకు లాగి చితకబాదారు. భైరి నరేష్పై దాడి చేసిన వారిని ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల భద్రత మధ్య ఉన్న భైరి నరేష్పై దాడి చేయడం కలకలం రేపింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. భైరి నరేష్పై దాడి చేశారు. హిందూ దేవుళ్లు, దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు
గత ఏడాది డిసెంబర్ లో కొడంగల్లో జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భైరి నరేష్ .. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప నువ్వు నా కొంప ముంచావంటూ బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భైరి నరేష్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న భైరి నరేష్ను అరెస్ట్ చేశారు. శాంతికి విఘాతం కలిగిచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భైరి నరేష్ కి ఇటీవల బెయిల్ మంజూరు అయింద కోడంగల్ కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ జైల్లో ఉండి ఫిబ్రవరి 16న విడుదలయ్యారు.అయినా.. తన తీరు మార్చుకోకుండా.. బైరి నరేష్.. నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడన్న ఆగ్రహంతో దాడి చేసినట్లు అయ్యప్ప భక్తులు అంటున్నారు.