బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితులను గోవాలో కొందరిని అరెస్ట్ చేశారు. గోవాలో అరెస్టైన నిందితులను మంగళవారం నాడు రాత్రికి హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితులను గోవాలో కొందరిని అరెస్ట్ చేశారు. గోవాలో అరెస్టైన నిందితులను మంగళవారం నాడు రాత్రికి హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.
ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు అతని సోదరులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు పలువురిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు..
also read:కిడ్నాప్ కోసం తాత్కాలిక సిమ్ వాడిన అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్
కిడ్నాప్ చేసిన నిందితుల్లో 16 మందిలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో ఇవాళ భాగంగా విజయవాడలోని నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులకు గాను నిందితులు గోవాలో ఉన్నారనే సమాచారం తెలిసింది.
ఈ సమాచారం ఆధారంగా గోవాలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని విజయవాడలో అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడతో పాటు గోవాలో అదుపులోకి తీసుకొన్న వారిని ఇవాళ రాత్రికి హైద్రాబాద్ కు తరలించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 12, 2021, 6:06 PM IST