కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి మృతి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది హత్యనా, ఆత్మహత్యనా అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోలేక పోతుందన్నారు.

కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి మృతి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది హత్యనా, ఆత్మహత్యనా అన్న విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోలేక పోతుందన్నారు. ఎవరైనా సొంతంగా వారికి వారే ఇంజెక్షన్ తీసుకోవడం అసాధ్యం అని చెప్పారు. రాజకీయాల కోసమే ప్రీతిని నిమ్స్‌కు తరలించారని విమర్శించారు. ప్రీతి మెడికల్ వెంటిలేటర్‌పై లేదని.. పొలిటికల్ వెంటిలేటర్ మీద ఉందని కామెంట్ చేశారు. మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్సీ) ప్రీతిని అపోలోకి షిప్ట్ చేయమన్నందుకే అసలు విషయం బయటకు వస్తుందని డెత్ డిక్లెర్ చేశారని ఆరోపించారు. 

ప్రీతి మృతి ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బీఆర్ఎస్‌కు మరో విభాగంగా చేశారని ఆరోపించారు. నేరాలు జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ట్విట్టర్‌లో మెస్సేజ్ వస్తేనో, ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తేనో పోలీసులు స్పందిస్తారని ఆరోపించారు. 

Also Read: ఆ రెండు ఘటనలు.. రగిలిపోయిన సైఫ్, రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీలు, హేళన : రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఇక, కేఎంసీలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఎంజీఎంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.
అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం విశ్వప్రయత్నాలు చేసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. ప్రీతి మృతి కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనతి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అతని సెల్‌ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనూష, భార్గవి, LDD+Knockouts గ్రూప్ చాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగం ప్రీతికి సూపర్‌వైజర్‌గా సైఫ్ వ్యవహరిస్తున్నాడు. రెండు ఘటనల కారణంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ప్రీతి. అయితే వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి రాసిన రిపోర్టును హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు సైఫ్. అయితే తనతో ఏమైనా ప్రాబ్లమ్ వుంటే హెచ్‌వోడీకి చెప్పాలని సైఫ్‌కు ప్రీతి వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రీతిని వేధించాలని భార్గవ్‌కు చెప్పాడు సైఫ్. అంతేకాకుండా ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. ఈ వేధింపుల నేపథ్యంలో ఫిబ్రవరి 21న హెచ్‌వోడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళీ, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది.