సారాంశం

Telangana Congress: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై నిప్పులు చెరిగిన తెలంగాణ కాంగ్రెస్..  తాజాగా 'బై బై కేసీఆర్' ప్రచారాన్ని ప్రారంభించింది. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారనీ, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర నిధులు, ఉద్యోగావకాశాలు కేటాయించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.  

Telangana Assembly Elections 2023: అంబర్‌పేట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలని పేర్కొన్నారు. శనివారం బర్కత్‌పుర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండు చేతులు కలిపి పని చేస్తున్నాయనీ, ఈ పరిస్థితికి అసెంబ్లీ రౌడీ సినిమా కారణమని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నరేంద్ర మోదీని కేసీఆర్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు.

డా.సి.రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అధికార బీఆర్‌ఎస్ పార్టీ పాలనపై అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. అంబర్‌పేట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై డా.సి.రోహిణ్‌రెడ్డి స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు, సంక్షేమ పథకాల అమలు వంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. మహంకాళి దేవాలయం, సాయిబాబా గుడి, దర్గాలలో సంక్షేమ పథకాల అమలుపై చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, తనకు ఆర్థికంగా స్థిరత్వం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై నిప్పులు చెరిగిన తెలంగాణ కాంగ్రెస్.. 'బై బై కేసీఆర్' ప్రచారాన్ని ప్రారంభించింది. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర నిధులు, ఉద్యోగావకాశాలు కేటాయించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.