లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్కు బెయిల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ నగరంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు
లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్కు బెయిల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ నగరంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఏకంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో.. సంజయ్ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా హోంమంత్రి నిజామాబాద్ పోలీసులను ఆదేశించారు. కొద్దిరోజులు అజ్ఞాతంలో గడిపిన తర్వాత లాయర్తో కలిసి సంజయ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు. తాజాగా సంజయ్ బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
