Asianet News TeluguAsianet News Telugu

పిరికిపంద చర్య.. బీజేపీ నేత‌పై దాడి చేసిన బీర్ఎస్ ఎమ్మెల్యేను ఆరెస్టు చేయండి : కిష‌న్ రెడ్డి

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలపై ఒక‌ టీవీ చర్చ హింసాత్మకంగా మారిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని గొంతును ప‌ట్టుకున్నారు. కార్యక్రమంలో ఉన్న జర్నలిస్టులు నాయకులను విడదీసేందుకు పరుగులు తీశారు, అయితే ఆగ్రహించిన కార్యకర్తలు బారికేడ్లను తెరిచేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిపై స్పందించి రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి దీనిని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. 
 

Arrest BRS MLA who attacked Goud on live TV debate: Telangana BJP chief G Kishan Reddy RMA
Author
First Published Oct 26, 2023, 12:52 PM IST

Telangana BJP chief G Kishan Reddy: టీవీ చర్చ సందర్భంగా పార్టీ అభ్యర్థిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాడిని తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారు. దాడికి పాల్ప‌డిన ఆ ఎమ్మెల్యేను వెంట‌నే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే కేపీ వివేకానంద గొంతు పట్టుకోవడంతో టీవీ లైవ్ చర్చ గంద‌ర‌గోళంగా మారింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జీ కిష‌న్ రెడ్డి.. ''తెలంగాణలో లైవ్ టీవీ చర్చలో బీజేపీ నాయకుడిపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే దాడి చేశారు. వివేకానంద గౌడ్‌ గొంతు పట్టుకుని దాడి చేయడం పిరికిపంద చర్య'' అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, జరిగిన సంఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా నాయ‌కుడు కే.ల‌క్ష్మ‌ణ్ స్పందిస్తూ.. “టీవీ చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే ప్రతిపక్ష నాయకుడు చాలా ప్రశ్నలు వేస్తారు, కాబట్టి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.. ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోండి. కానీ నిరాశ, నిస్పృహ కారణంగా, వారు (బీఆర్‌ఎస్) ప్రాబల్యం కోల్పోతున్నందున,  బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు, ఇది బీఆర్‌ఎస్ ఎంత డిప్రెషన్‌లో ఉందో తెలియ‌జేస్తోంది'' అని విమ‌ర్శించారు. "వారు ఇప్పుడు యుద్ధంలో ఓడిపోతున్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, డబ్బు అవినీతి ఎలా జరుగుతుందో ఊహించండి. వారిని భూకబ్జాలు, అవినీతిపై ప్రశ్నించడంతో సహనం కోల్పోయారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసులు కేసు బుక్ వారిని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే బీజేపీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని'' తెలిపారు.

దాడికి పాల్ప‌డిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ బీజేపీ డిమాండ్ చేసింది. "మేము అతనిని పోటీ నుండి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అతనిపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ఏ పరిమితిని అయినా దాటవచ్చని తెలంగాణ ప్రజలకు ఇది సందేశం. టీవీ డిబేట్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో ఇది జరిగింది, కాబట్టి ఈ అధికార పార్టీ బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం ఎలా చేస్తుందో మీరు ఊహించవచ్చు” అని లక్ష్మణ్ అన్నారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios