సెంట్రల్ యూనివర్శిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ. ఆ యూనివర్శిటీలో మరో యువ కిశోరం బలయ్యాడు. ఆ యూనివర్శిటీలో పిహెచ్ డి చదువుతున్న విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఆత్మహత్య తర్వాత అతి కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం విద్యార్థుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
రోహిత్ ఆత్మహత్య ఘటన మరచిపోకముందే మరో ఆత్మహత్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చోటు చేసుకుంది. హెచ్.సి.యు.లో పిహెచ్ డి చదువుతున్న విశాల్ ఆత్మహత్యకు పాల్పడడంతో యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ. ఆ యూనివర్శిటీలో మరో యువ కిశోరం బలయ్యాడు. ఆ యూనివర్శిటీలో పిహెచ్ డి చదువుతున్న విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యూనివర్శిటీ పక్కనే ఉన్న అపర్ణ సరోవర్ భవనంలో నివాసం ఉంటున్నాడు విశాల్. ఆ బిల్డింగ్ లోని 14వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినాడు విశాల్.
విశాల్ మరణవార్త విని యూనివర్శిటీ శోకసంద్రంలో మునిగిపోయింది. విశాల్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.