మహిళపై యాసిడ్ అటాక్
- జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్ లో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశారు.
దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధంమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.