గతంలో నాటకాలతో, సాహిత్యంతో ప్రజలను మెప్పిచ్చిన దేశపతి ఆంద్రోళ్ల దోపిడి గురించి నాటకం ద్వారా వివరిస్తున్న దేశపతి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఇప్పుడున్న దేశపతికి 20 ఏండ్ల కింద ఉన్న దేశపతికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ... కానీ ఇరవై ఏండ్ల క్రితం ఆయనో కళకారుడు.

తెలంగాణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గతంలో 14,15-02-1998 తేదీల్లో జరిగిన ఓ నాటకంలో దేశపతి నటించాడు. ఈ నాటకంలో బంగారం లాంటి తెలంగాణ భూములను ఆంద్రోళ్లు దోచుకోవడంతో తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ నాటకంతో దేశపతి సిద్దిపేట ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఆయన ఈ నాటకంలో నటించడం కాదు జీవించాడనే చెప్పాలి. ఆయన ఈ నాటకం వీడియోను మూసి టీవి వారి సౌజన్యంతో మన ఏషియానెట్ ప్రేక్షకులకోసం అందిస్తున్నాం.