Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్తగా 15 కేసులు.. హైదరాబాద్‌లో అత్యధికం: 943కి చేరిన బాధితుల సంఖ్య

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 15 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 943కి చేరింది. 194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

15 more coronavirus positive cases registered in telangana
Author
Hyderabad, First Published Apr 22, 2020, 9:36 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 15 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 943కి చేరింది. 194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో 3, గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.  సూర్యాపేటలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఒక్క రోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా సూర్యాపేట పట్టణంలోనే నమోదయ్యాయి. 

Also Read:సూర్యాపేటలో మరో మూడు కేసులు: జిల్లాలో 83కు చేరిన సంఖ్య

జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేటలోనే నమోదయ్యాయి. మంగళవారం జీహెచ్ఎంసీలో కన్నా ఎక్కువ కేసులు అక్కడ నమోదయ్యాయి. దాంతో కేసీఆర్ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూర్యాపేటలో పర్యటించారు.

అదే సమయంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న గద్వాల, వికారాబాద్ జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ జిల్లాల్లో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. 

Also Read:క్వారంటైన్, కరోనా టెస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

సూర్యాపేటకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. మర్కజ్ నుంచి వచ్చినవారి గురించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios