నిర్మల్ జిల్లాలో బస్సు బోల్తా
నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైంది. తరోడ మీదుగా వెళ్లున్న బస్సుకు పశువులు అడ్డుగా రావడంతో బస్సు డ్రైవర్ ఆ పశువులను తప్పించబోయి బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బోల్తా పడింది. ఆర్టీసి బస్సు బోల్తా పడడంతో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైంది.
ఆర్టీసి బస్సు బోల్తా పడడంతో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయపడిన వారిని భైంసా ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తరోడ మీదుగా వెళ్లున్న ఆర్టీసి బస్సుకు పశువులు అడ్డుగా రావడంతో బస్సు డ్రైవర్ ఆ పశువులను తప్పించబోయి బ్రేక్ వేశాడు. దీంతో ఒక్కసారిగా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బోల్తా పడింది.
గాయపడిన వారిని భైంసా ఆసుప్రతికి అంబులెన్సులలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
బస్సు డ్రైవర్ సమయస్పూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు అంటున్నారు.