జూన్ 5 నుంచి 19 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం వల్లే ఈ సారి ఉత్తీర్ణత తగ్గిందని పేర్కొన్నారు.
కాగా, జిల్లాల పరంగా చూస్తే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 97.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక వనపర్తి జిల్లా ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 67 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
2005 స్కూళ్లలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ సారి 20 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.
కాగా, జూన్ 5 నుంచి 19 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
