నగరంలోని ఉప్పల్ లో శుక్రవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా , పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురు బైకర్లకు గాయాలయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ లో శుక్రవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా , పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురు బైకర్లకు గాయాలయ్యాయి.
ఉప్పల్ -హబ్సిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద ఓ లారీ వేగంగా వచ్చి ఓ డీసీఎంను ఢీకొట్టింది. దీంతో అక్కడే ఉన్న ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాదు అక్కడే పార్క్ చేసిన బైకులపైకి లారీ దూసుకెళ్లింది.
ఉప్పల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... గుడిలోకి దూసుకెళ్లిన లారీ...#uppal #Habsiguda #Hyderabad pic.twitter.com/FazLSLQ6Wq
— Asianetnews Telugu (@AsianetNewsTL) January 1, 2021
ఈ ఘటనలో ఓ బైక్ పై ప్రయాణీస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. డీసీఎం వ్యానులో ప్రయాణీస్తున్న నలుగురు గాయపడ్డారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఉప్పల్- సికింద్రాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
లారీ డ్రైవర్ ను స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 12:37 PM IST