Asianet News TeluguAsianet News Telugu

Xiaomi Book S: Xiaomi ఫస్ట్ 2-in-1 ల్యాప్‌టాప్‌.. లాంచ్ ఆఫర్ ప్రకటించిన సంస్థ..!

Xiaomi Book S 2-in-1 ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ప్రవేశించింది. తాజాగా Xiaomi Book S పేరుతో కొత్త  ల్యాప్‌టాప్‌ను ప్రారంభించింది.  ఈ ల్యాప్‌టాప్ 8 GB RAM, 256 GB స్టోరేజ్‌తో వస్తుంది.  ఇందులో  ప్రధాన కెమెరా 13-మెగాపిక్సెల్‌తో వస్తోంది.
 

Xiaomi targets mobile workers with Snapdragon-powered 2-in-1 convertible
Author
Hyderabad, First Published Jun 24, 2022, 12:49 PM IST

ప్రముఖ మొబైల్ బ్రాండ్ కంపెనీ Xiaomi మొదటి 2-in-1 ల్యాప్‌టాప్ Xiaomi Book Sని లాంచ్ చేసింది. ఈ డివైజ్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని ట్యాబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను యూరప్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధర 700 యూరోలు (సుమారు రూ. 57,800) ఉండగా.. లాంచ్ ఆఫర్ కింద 600 యూరోలకే (రూ. 49,600) కొనుగోలు చేసేందుకు కంపెనీ అవకాశం కల్పిస్తోంది. Xiaomi Book S త్వరలో భారత్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఈ 2-ఇన్-1 ల్యాప్‌టాప్ 12.4-అంగుళాల డిస్‌ప్లేతో 13.4 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 Xiaomi Book S 2-in-1 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లో 2560x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 12.4-అంగుళాల LCDని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌లో కనిపించే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. ఈ కంపెనీ విడుదల చేసిన ఈ మొదటి 2-ఇన్-1 ల్యాప్‌టాప్ స్లిమ్ బెజెల్స్‌తో అమర్చబడింది. దీనిని 16:10 యాస్పెక్ట్ రేషియోను అందించారు. డిస్‌ప్లే గరిష్ట లైటింగ్ రెంజ్ 500 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 720 గ్రాములు. దీని మందం 8.95 మిమీగా ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ను కంపెనీ అల్యూమినియం-మెగ్నీషియం మిశ్రమంతో తయారు చేసింది, ఇది ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. Xiaomi Book Sలో ఫోటోగ్రఫీ కోసం, 13 మెగాపిక్సెల్‌ల వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ల ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. కాలింగ్, సౌండ్ కోసం, కంపెనీ రెండు మైక్రోఫోన్‌లతో కూడిన డ్యూయల్ స్పీకర్ సిస్టమ్‌ను అందించింది.

Follow Us:
Download App:
  • android
  • ios