లేటెస్ట్   వివో యు సిరీస్ నుండి ఐఫోన్ 11 ప్రో వరకు, వినియోగదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు.  స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ పొందడమే కాకుండా, నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఇంకా గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

బెంగళూరు: అమెజాన్ ఇండియాలో 19 డిసెంబర్ నుండి 23 డిసెంబర్ వరకు లేటెస్ట్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్స్ పై “ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్”ఆఫర్ ను ప్రకటించింది.వినియోగదారులు శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఆపిల్, వివో, ఒపిపిఓ, హువావే, హానర్ వంటి టాప్ బ్రాండ్లలో స్మార్ట్‌ఫోన్‌లు, అసెసోరీస్ లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను పొందవచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


కస్టమర్లు తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ పొందడమే కాకుండా, నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఇంకా గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.కొత్త వివో యు సిరీస్ స్మార్ట్ ఫోన్ నుండి ఐఫోన్ 11 ప్రో వరకు వినియోగదారులు శాన్‌సంగ్ గెలాక్సీ ఎం 40, ఎం 30, ఎం 20 లతో పాటు వన్‌ప్లస్ 7 టి వంటి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తుంది.

also read కొత్త సోలార్ పవర్ హెడ్‌ఫోన్స్...ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులవరకు..


ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా ఆపిల్ డేస్‌లో భాగంగా వినియోగదారులు ఆపిల్ ఐఫోన్ మరియు ఆపిల్ అసెసోరీస్ లపై ఆసక్తికరమైన ఆఫర్‌లను కూడా చూడవచ్చు.అదనంగా వన్‌ప్లస్, శామ్‌సంగ్, జాబ్రా, రియల్‌ మీ వంటి టాప్ బ్రాండ్ల నుండి అసెసోరీస్ లను అతి తక్కువ ధరలకు పొందవచ్చు.

వన్‌ప్లస్ 7టి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రూ .37,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. వన్‌ప్లస్ 7 టి, 8జిబి ర్యామ్, 128 జిబి మెమరీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో ప్రస్తుతం రూ .34,999 కు లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా స్టాండర్డ్, ఇఎంఐ లావాదేవీలపై అమెజాన్ ఇండియా 1,500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది.

also read శాంసంగ్‌ నుంచి మరో స్మార్ట్ బడ్జెట్ ఫోన్...

వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ భారతదేశంలో రూ .48,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. అమెజాన్ ఇండియాలో రూ .42,999 కు ఇప్పుడు లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డు వారికి స్టాండర్డ్, ఇఎంఐ లావాదేవీలపై రూ .2,000 తగ్గింపుకు లభిస్తుంది.

 ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 49,900 రూపాయలు. అమెజాన్ ఫాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా ఈ ఫోన్ రూ .45,900 కు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా వినియోగదారులకు రూ .9,250 వరకు ఆఫ్ పొందవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 40 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ .19,990. ఇది ఇప్పుడు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా ఇండియాలో రూ .16,999 కు లభిస్తుంది. కొత్త గెలాక్సీ ఎం 40 కోసం వినియోగదారులు తమ పాత ఫోన్‌ ద్వారా ఎక్స్ఛేంజి చేసుకుంటే రూ .9,250 వరకు ఆఫ్ పొందవచ్చు.