విరాట్ కోహ్లీ, అనుష్క ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత విరుష్క కపుల్ పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత విరుష్క కపుల్ పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బృందావనంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ను దర్శించుకుని ఆశీస్సులు పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అయోధ్య రామాలయాన్ని సందర్శించారు.
రామాలయం, హనుమాన్ గఢీలో విరాట్-అనుష్క పూజలు
విరాట్, అనుష్క ఆదివారం రామాలయం దర్శించుకున్న తర్వాత హనుమాన్ గఢీకి వెళ్లి పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజారి సంజయ్ దాస్ జీ మహారాజ్ విరాట్ కి మాల వేసి, తిలకం దిద్దారు. వీరిద్దరూ పూజలు చేసి హనుమాన్ ఆశీస్సులు పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్, ఇప్పుడు వన్డే, టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కి ముందు విరాట్, అనుష్క అయోధ్యలో రామాలయం, హనుమాన్ గఢీ దర్శించుకున్నారు.
హనుమాన్ గఢీ పూజారి సంజయ్ దాస్ జీ మహారాజ్ మాట్లాడుతూ, “విరాట్, అనుష్కలకు ఆధ్యాత్మికత, సంస్కృతి, సనాతన ధర్మం పట్ల అమిత ప్రేమ ఉంది. వారు రామాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, హనుమాన్ ఆశీస్సులు పొందారు. హనుమాన్ ఆశీస్సులతో వారికి విజయం తప్పక దక్కుతుంది” అని అన్నారు.