ఈ ఓటమి నమ్మబుద్ధి కావడం లేదు.. కిరణ్ రిజిజు ట్వీట్ తర్వాతే అంగీకరించా: ఏషియానెట్తో మేరీకోమ్
క్వార్టర్ ఫైనల్స్ తర్వాత టోక్యో నుంచి ఫోన్ ద్వారా ఏషియానెట్తో ఆమె మాట్లాడుతూ, ఓటమిపై కోమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను మ్యాచ్ తర్వాత నేరుగా డోప్ టెస్ట్ కోసం వెళ్ళానని.. తద్వారా, మ్యాచ్ తీర్పు మనకు అనుకూలంగా లేదని కోచ్ చెప్పడానికి ప్రయత్నించారని వెల్లడించారు
టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం గర్వించదగిన మహిళా బాక్సర్, 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ పోరాటం ముగిసింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్లో, మేరీ కోమ్ కొలంబియాకు చెందిన ఇంగ్రిత్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇది సరైన నిర్ణయం కాదని మేరీ కోమ్ అన్నారు.
క్వార్టర్ ఫైనల్స్ తర్వాత టోక్యో నుంచి ఫోన్ ద్వారా ఏషియానెట్తో ఆమె మాట్లాడుతూ, ఓటమిపై కోమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను మ్యాచ్ తర్వాత నేరుగా డోప్ టెస్ట్ కోసం వెళ్ళానని.. తద్వారా, మ్యాచ్ తీర్పు మనకు అనుకూలంగా లేదని కోచ్ చెప్పడానికి ప్రయత్నించారని వెల్లడించారు. కానీ తాను ఈ చర్చను అంగీకరించే స్థితిలో లేనని కోమ్ ఏషియానెట్ న్యూస్తో చెప్పారు.
Also Read:టోక్యో ఒలింపిక్స్: ముగిసిన మేరీకోమ్ పోరాటం... రెండో రౌండ్లో ఓడి...
తాను మ్యాచ్లో మంచి పోరాటం చేశానని... సరైన తీర్పు వస్తే, విజయం నా సొంతమేనన్నారు. కానీ తీర్పు వేరే విషయమని తాను ఓడిపోయినట్లు కోచ్ మాటను నమ్మలేదని మేరీ కోమ్ అన్నారు. కోచ్, మాజీ క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చూసిన తర్వాతే "తాను మ్యాచ్ ఓడిపోయానని తెలుసుకున్నాను " అని మేరీ కోమ్ తెలిపారు.
తాను ఒలింపిక్స్ కోసం ఎంతో శ్రమించానని, కఠినమైన శిక్షణ పొందానని మేరీ కోమ్ పేర్కొన్నారు. వీలైనంత పోరాడినా తాను భారత్కు పతకం సాధించలేకపోయాయని.. తన ప్రదర్శనపై తనకు నమ్మకం వుందని మేరీ కోమ్ వ్యాఖ్యానించారు. తాను మంచి పోరాటం చేశానని.. మొత్తం మ్యాచ్పై నియంత్రణ సాధించినా విజయం తన చేజారిందని మేరీకోమ్ ఏషియానెట్కు వివరించారు.