Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: మిక్స్డ్ ఆర్చరీలో భారత్ ఆశలు గల్లంతు...క్వార్టర్స్ లో ఓటమి

భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీ మిక్స్డ్ టీం ఈవెంట్ లో భారత ఆర్చర్ల జోడి దీపికాకుమారి,ప్రవీణ్ జాదవ్ నిరాశను మిగిల్చారు.

Tokyo Olympics: Indian Mixed Team Looses to Korea in Quarter Finals
Author
Tokyo, First Published Jul 24, 2021, 12:24 PM IST

భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీ మిక్స్డ్ టీం ఈవెంట్ లో భారత ఆర్చర్ల జోడి దీపికాకుమారి,ప్రవీణ్ జాదవ్ నిరాశను మిగిల్చారు. ఉదయం జరిగిన క్వాలిఫైయింగ్ లో పూర్తి స్థాయి ప్రదర్శనను చేయడంలో విఫలమైన భారత జోడి... కఠిన ప్రత్యర్థి అయిన కొరియా జోడితో తలపడాల్సి వచ్చింది. 

కొరియా జోడితో జరిగిన మ్యాచులో ఏ కోణంలో కూడా ముందంజలో లేరు భారత ఆర్చర్లు. కొరియా జోడి భారత అథ్లెట్లను సునాయాసంగా మట్టి కరిపించి సెమిస్ లోకి ప్రవేశించారు. తొలి సెట్ ను 4-0 తో కైవసం చేసుకున్న కొరియా జోడి... రెండవ సెట్ ను 4-2 ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. 

ఇక వ్యక్తిగత ఏవేట్లో దీపికా కుమారి ఒక్కతే భారత ఆర్చరీ ఆశాకిరణంగా కనబడుతుంది. దీపికా కుమారి ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన వరల్డ్ ఆర్చరీ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన దీపికపై భారత్ బోలెడశాలు పెట్టుకుంది. 

ఇక ఉదయం మహిళల షూటింగ్ లో భారత్ కి నిరాశ ఎదురయినది. ఉదయం జరిగిన క్వాలిఫైయర్స్ లో భారత మహిళలు ఫైనల్ బెర్త్ ను సాధించలేకపోయారు. మరో వైపు భారత షూటింగ్ ఆశాకిరణం సౌరభ్ చౌదరి మరికాసేపట్లో జరగనున్న షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో తలపడనున్నాడు. 

మరోవైపు భారత్ కి వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చను తొలి పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి భారత్ ఖాతా తెరిచింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 

చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తిన మీరాభాయ్ ఛాను, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి అదరగొట్టింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలను ఎత్తేందుకు చేసేందుకు ప్రయత్నం విఫలమైంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహుయ్ టాప్‌లో నిలిచి, స్వర్ణం సాధించింది.

2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తెలుగు అథ్లెట్ కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది మీరాభాయి ఛాను... వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది మీరాభాయి ఛాను... 

Follow Us:
Download App:
  • android
  • ios