MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ నుండి అత్యధికంగా నలుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్ జట్ల నుండి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 21 2025, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్సీబీ, రాజస్థాన్ అవుట్.. టీమిండియాలో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం!
Image Credit : ANI

ఆర్సీబీ, రాజస్థాన్ అవుట్.. టీమిండియాలో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం!

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నాహాలు పూర్తి చేసింది. డిసెంబర్ 20న అధికారికంగా టీమిండియా జట్టును కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు.

అయితే ఈసారి జట్టు ఎంపికలో ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రాతినిధ్యంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లలో కేవలం 7 జట్ల ఆటగాళ్లు మాత్రమే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సహా మూడు ప్రముఖ ఫ్రాంచైజీల నుండి ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఈసారి ఎంపికలో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్ 2026 వేలానికి ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో, భారత జట్టు కూర్పులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలకు ఉద్వాసన పలికి, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లకు అవకాశం కల్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత జట్టు ముంబై ఇండియన్స్ జోరు
Image Credit : Asianet News

భారత జట్టు ముంబై ఇండియన్స్ జోరు

టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో అత్యధిక మంది ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ (MI) నుంచే ఎంపికయ్యారు. ఈ జట్టు నుండి మొత్తం నలుగురు ఆటగాళ్లు టీమిండియా జెర్సీ ధరించనున్నారు. ఇందులో ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది.

రెండో ప్లేయర్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రపంచ కప్‌లో ఫినిషర్ పాత్రను పోషించడానికి హార్దిక్ సిద్ధంగా ఉన్నాడు. మూడవ ఆటగాడిగా యువ సంచలనం తిలక్ వర్మ ఎంపికయ్యాడు. తిలక్ ప్రస్తుతం టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో అత్యంత నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. ఇక నాలుగవ పేరు పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే బాధ్యత బుమ్రాపై ఉంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ఆటగాళ్లు కీలక పాత్ర పోషించనున్నారు.

Related Articles

Related image1
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Related image2
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
36
కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై జట్ల వాటా ఏంటి?
Image Credit : SRH\Instagram

కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై జట్ల వాటా ఏంటి?

ముంబై తర్వాత అత్యధిక ఆటగాళ్లను అందించిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిలిచింది. ఈ జట్టు నుండి ముగ్గురు ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించారు. స్పిన్ మ్యాజిక్ చూపించే వరుణ్ చక్రవర్తి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఫినిషర్ రింకూ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరి ముగ్గురూ కేకేఆర్ తరపున నిలకడగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుండి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నుండి ఎంపికయ్యాడు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలెక్టర్లు వీరి వైపు మొగ్గు చూపారు.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుండి కూడా ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో చేరారు. ఓపెనింగ్ బాధ్యతలు పంచుకోగల వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఆల్ రౌండర్ శివం దూబే చెన్నై జట్టు నుండి ఎంపికయ్యారు. సంజూ శాంసన్ దూకుడుగా ఆడటంలో దిట్ట కాగా, శివం దూబే బ్యాట్, బాల్‌తో జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు.

46
ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్ల నుంచి ఎంత మంది ప్లేయర్లు టీమిండియాలో ఉన్నారు?
Image Credit : ANI

ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్ల నుంచి ఎంత మంది ప్లేయర్లు టీమిండియాలో ఉన్నారు?

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు నుండి స్పిన్ విభాగంలో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఎంపికయ్యారు. అక్షర్ పటేల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా జట్టులో ఉన్నాడు. వీరిద్దరి అనుభవం ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది.

పంజాబ్ కింగ్స్ (PBKS) నుండి కేవలం అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్ష్‌దీప్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గుజరాత్ టైటాన్స్ (GT) నుండి స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

56
ఆర్సీబీ, రాజస్థాన్, లక్నో ప్లేయర్లకు దక్కని చోటు
Image Credit : Getty

ఆర్సీబీ, రాజస్థాన్, లక్నో ప్లేయర్లకు దక్కని చోటు

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో మూడు ప్రముఖ ఐపీఎల్ జట్ల నుండి ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల నుండి ఏ ఒక్క ఆటగాడిని కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

విశేషమేమిటంటే, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు గతంలో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించినా, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కోటాలో చూపించడం గమనార్హం. ఈ మూడు జట్ల నుండి ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆయా జట్ల అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

66
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు
Image Credit : Insta/indiancricketteam

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Recommended image2
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved