Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్‌: భారత్‌కి కలిసిరాని మండే... బాక్సింగ్‌లో ఆశీష్ కుమార్ ఓటమి...

 75 కేజీల విభాగంలో చైనా బాక్సర్ ఎర్బీకీ టోహేటాతో జరిగిన ఫైట్‌లో 0-5 తేడాతో ఓడిన భారత బాక్సర్ ఆశీష్ కుమార్...

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌ను వెంటాడుతున్న వరుస ఓటములు...

Tokyo olympics: Indian boxer Ashish Kumar losses in First Round CRA
Author
India, First Published Jul 26, 2021, 3:50 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి సోమవారం పెద్దగా కలిసి రావడం లేదు. 75 కేజీల విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ ఆశీష్ కుమార్, చైనాకి చెందిన ఎర్బీకీ టోహేటాతో జరిగిన ఫైట్‌లో 0-5 తేడాతో ఓడి పోటీ నుంచి నిష్కమించాడు.

ప్రారంభంలో అటాకింగ్‌ చేస్తూ, ఆధిక్యం సంపాదిస్తున్నట్టు కనిపించిన ఆశీష్ కుమార్, కొద్దిసేటి తర్వాత చైనా బాక్సర్ దూకుడు ముందు నిలవలేకపోయాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం టీమిండియాకి పెద్దగా కలిసిరాలేదు. భారత ఆర్చరీ పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడగా, టీటీ ప్లేయర్ సుత్రీత, బ్యాడింటన్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఫెన్సర్ భవానీ దేవీ రెండో రౌండ్‌లో ఓడారు.

భారత షూటర్లు అంగడ్ భజ్వా, మైరాజ్ ఖాన్ స్కీట్ ఈవెంట్‌లో 18, 25వ స్థానంలో నిలిచి ఘోరంగా విఫలమయ్యారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో టీటీ ప్లేయర్ మానికా బత్రా కూడా వరుస సెట్లలో ఓడి పోటీ నుంచి నిష్కమించింది. 

భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ రెండో రౌండ్‌లో ఓడగా, వుమెన్ సెయిలర్ నేత్రా కుమారన్, పురుష సెయిలర్ విష్ణు శరవణ్ తీవ్రంగా నిరాశపరిచారు.  మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మాత్రం రెండో రౌండ్‌లో గెలిచి, మూడో రౌండ్‌కి అర్హత సాధించడం ఒక్కటే భారత జట్టుకి దక్కిన విజయం.

Follow Us:
Download App:
  • android
  • ios