మరో భారత రెజ్లర్ దీపక్ పూనియా కూడా ప్రీ క్వార్టర్స్ లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. టెక్నికల్ సుపీరియారిటీతో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు.
మరో భారత రెజ్లర్ దీపక్ పూనియా కూడా ప్రీ క్వార్టర్స్ లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. టెక్నికల్ సుపీరియారిటీతో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. నైజీరియాకు చెందిన రెజ్లర్ అగియోమోర్ పై సమయం మిగిలి ఉండగానే 10 పాయింట్లకన్నా అధిక లీడ్ ఉండడంతో టెక్నికల్ సుపీరియారిటీతో క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు.
తొలి పీరియడ్ ముగిసేసరికి 4-1 తో నిలిచినా దీపక్... రెండవ పీరియడ్ లో ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా... చివర్లో నెల్సన్,ఫ్లిప్ తో 12-1 తో గెలిచాడు. క్వార్టర్స్ లో తదుపరి కొద్దిసేపట్లో పోటీపడబోతున్నాడు.
ఇక ఉదయం టోక్యో ఒలింపిక్స్లో భారత్కి రెజ్లింగ్లో తొలి విజయం దక్కింది. 57 కేజీల ఫ్రీ స్టైయిల్ విభాగంల జరిగిన తొలి మ్యాచ్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా, కొలంబియన్ రెజ్లర్ ఆస్కర్ టిగ్రేరోస్తో జరిగిన మ్యాచ్ల 13-2 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నాడు.
అంతకుముందు జావెలిన్ త్రో ఈవెంట్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా, ఫైనల్స్కి అర్హత సాధించాడు. తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, టేబుల్ టాపర్గా నేరుగా ఫైనల్స్కి అర్హత సాధించాడు.
గ్రూప్ బీలో పోటీపడిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ శివ్పాల్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. మొదటి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరిన శివ్పాల్ సింగ్, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఆ మార్కును దాటలేకపోయాడు.
మహిళల 57 కేజీల విభాగంలో పోటీపడిన అన్షూ మాలిక్, తొలి రౌండ్లోనే ఓడింది. ఇర్యాన కురాచ్కినాతో జరిగిన మ్యాచ్లో 2-8 తేడాతో ఓడింది అన్షూ.