Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ మేరీకోమ్ శుభారంభం... తొలి రౌండ్‌లో...

తొలి రౌండ్‌లో డొమినిక్ రిప్లబిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్...

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్...

Tokyo Olympics 2020: Indian Ace Boxer Mary Kom wins first Round CRA
Author
India, First Published Jul 25, 2021, 1:51 PM IST

భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్‌, టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం దక్కించుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో డొమినిక్ రిప్లబిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్, రౌండ్ 16లోకి అడుగుపెట్టింది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్, ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. ఈ సారి స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌ బరిలో దిగుతోంది. 

అంతకుముందు టేబుల్ టెన్నిస్‌లోనూ భారత ప్లేయర్ మానికా బత్రా విజయం సాధించింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన మానికా బత్రా... 20వ సీడెడ్ అయిన ఉక్రెయిన్ ప్లేయర్ మార్గేట్టా పెసోస్కాను 4-3 తేడాతో ఓడించి మూడో రౌండ్‌కి దూసుకెళ్లింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios