Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: సానియా మీర్జా ఒలింపిక్ మెడల్ ఆశలు గల్లంతు...వరల్డ్ నెం.1 కూడాతొలి రౌండ్‌లోనే...

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మీర్జా- అంకితా రైనా జోడి ఓటమి...

ఉక్రెయిన్‌కి చెందిన లిడ్‌మిలా కిచెనోక్, నదియా కిచెనోక్‌లతో జరిగిన మ్యాచ్‌లో 6-0, 6-7, 8-10 తేడాతో ఓడిన భారత మహిళలు...

 

Tokyo 2020: Sania Mirza and Ankita Raina losses in first Round, And Ashleigh Barty too CRA
Author
India, First Published Jul 25, 2021, 9:38 AM IST

ఒలింపిక్స్‌లో భారత స్టార్ల ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆర్చర్ దీపికా కుమారి, షూటర్ మను బకర్ నిరాశపరచగా, భారీ ఆశలతో ఒలింపిక్ చేరిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా తొలి రౌండ్ దాటలేకపోయింది.

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో భారత జోడి సానియా మీర్జా- అంకితా రైనా, ఉక్రెయిన్‌కి చెందిన లిడ్‌మిలా కిచెనోక్, నదియా కిచెనోక్‌లతో జరిగిన మ్యాచ్‌లో 6-0, 6-7, 8-10 తేడాతో ఓడిపోయారు.

తొలి సెట్‌లో భారత జోడి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో అదరగొట్టినా, రెండో సెట్‌ నుంచి ఉక్రెయిన్ జోడి దూకుడు కొనసాగింది. వరుస రెండు సెట్లతో సానియా- అంకితా రైనా జోడిని మట్టికరిపించిన ఉక్రెయిన్ సిస్టర్స్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

అలాగే వరల్డ్‌నెం. 1 ప్లేయర్, వింబుల్డన్ విన్నర్ ఆష్ బార్టీ కూడా తొలి రౌండ్‌లో నిష్కమించింది. స్పెయిన్‌కి చెందిన సారా సోరిబ్స్ టోర్మోతో జరిగిన మ్యాచ్‌లో 6-4, 6-3 తేడాతో చిత్తుగా ఓడి, ఒలింపిక్ నుంచి నిష్కమించింది ఆష్ బార్టీ. సోరబ్స్ టోర్మో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌కి అర్హత సాధించడం ఇదే ప్రథమం.

Follow Us:
Download App:
  • android
  • ios