Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఓటమి...

వరల్డ్ నెం.1 ఇండోనేషియా జోడి జిడెన్ మార్కస్, సుకముల్జో కెవిన్‌తో వరుస సెట్లలో 13-21, 12-21 తేడాతో ఓడిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి...

తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో మ్యాచ్ ఆడనున్న సాత్రిక్, చిరాగ్ శెట్టి... ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత... 

Tokyo 2020: Indian Men's double pair Satwiksairaj Rankireddy/ Chirag Shetty go down to World No. 1 CRA
Author
India, First Published Jul 26, 2021, 10:45 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ఇండోనేషియా జోడి జిడెన్ మార్కస్, సుకముల్జో కెవిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వరుస సెట్లలో 13-21, 12-21 తేడాతో ఓడింది. 

తొలి సెట్‌ను 6-6 సమం చేసిన భారత జోడి, ఆ తర్వాత ఇండోనేషియా జోడి జోరు ముందు నిలవలేకపోయింది. రెండో సెట్‌లో 3-6 తేడాతో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించిన భారత జోడి, ఆ తర్వాత వరుస పాయింట్లు అందించి మ్యాచ్‌ను కోల్పోయింది.

రెండో రౌండ్‌లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో మ్యాచ్ ఆడనున్న సాత్రిక్, చిరాగ్ శెట్టి, ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.  

Follow Us:
Download App:
  • android
  • ios