Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ఓటమి...

ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ అతానుదాస్ ఓటమి...

బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో రెండో రౌండ్‌లోనే ఓడిన టాప్ బాక్సర్ అమిత్ పంగల్..

Tokyo 2020: Archer Atanu Das losses in Men's Singles Pre-quarters CRA
Author
India, First Published Jul 31, 2021, 8:02 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం ఆరంభంలో భారత్‌కి ఆశించని ఫలితాలు దక్కలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మొదటి సెట్ టకహరు సొంతం చేసుకోగా రెండో సెట్ టై అయ్యింది.

మూడో సెట్‌లో అతానుదాస్ విజయం సాధించగా, నాలుగో సెట్ టై‌గా ముగిసింది. కీలకమైన ఐదో సెట్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓడిన అతానుదాస్, క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయాడు.

అలాగే బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ చేరిన అమిత్, కొలంబియాకు చెందిన హెర్నీ మార్టినెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios