బంగ్లాదేశ్ పర్యటనకు సీనియర్లు, భారత్ ‘‘ఏ’’ జట్టు ఇదే.. జడేజా, యాష్ దయాల్ ఔట్
డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టులో తొలుత స్థానం పొందిన యాష్ దయాల్, రవీంద్ర జడేజాల స్థానంలో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్లను ఎంపిక చేశారు సెలక్టర్లు.
డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు యాష్ దయాల్, రవీంద్ర జడేజాల స్థానంలో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నియమించింది. దయాల్కు వెన్నెముకలో సమస్య వుండగా.. జడేజా మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం వీరిద్దరూ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కొనసాగుతున్నారు.
ఇకపోతే.. న్యూజిలాండ్లో నవంబర్ 25 నుంచి అక్లాండ్లో ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు తొలుత కుల్దీప్, షాబాజ్లు జట్టులో స్థానం సంపాదించారు. అయితే వారు ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో భాగం కానున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం న్యూజిలాండ్లో వున్న వన్డే జట్టులో ఎవరినీ భర్తీ చేయలేదు.
మార్పులు, చేర్పుల తర్వాత వివిధ సిరీస్ల కోసం భారత జట్లు ఇవే :
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ , అర్ష్సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్ ఎతో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్లకు కూడా సెలక్టర్లు ఇండియా ఎ జట్టును ఎంపిక చేశారు.
తొలి నాలుగు రోజుల ఆట కోసం ఇండియా ఎ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్ ), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్ ), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ సేథ్
రెండవ నాలుగు రోజుల ఆట కోసం ఇండియా ఎ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్ ), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ సేథ్, ఛటేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ , కేఎస్ భరత్ (వికెట్ కీపర్)