Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకు షాక్

పాకిస్తాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది

team india loses top place england icc odi rankings

 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ర్యాంకులు ప్రకటించగా. కోహ్లీ సేనకు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నిరేశే ఎదురైంది.  వన్డేల్లో విరాట్ కోహ్లీ సేన  నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. ఇంగ్లండ్ 125 పాయింట్లతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా, టీ20ల్లో భారత్ రెండు పాయింట్లు సాధించినా.. మూడో స్థానంలోనే కొనసాగుతోంది.    ఒక పాయింట్ కోల్పోయిన భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 8 పాయింట్లు         సాధించిన ఇంగ్లండ్ అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2013 జనవరి తర్వాత ఇంగ్లండ్ టాప్ ర్యాంకు దక్కించుకుకోవడం ఇదే తొలిసారి.

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
    1.  ఇంగ్లండ్        125 పాయింట్లు
    2.  భారత్           122     ''
    3.  దక్షిణాఫ్రికా      113     ''
    4. న్యూజిలాండ్‌   112     ''

     ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
    టాప్-5 జట్లు అదే ర్యాంకులో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ 130 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లండ్‌ (115), దక్షిణాఫ్రికా(114) టాప్ 5 స్థానాలు మళ్లీ నిలబెట్టుకున్నాయి. టీమిండియా రెండు పాయింట్లు  సాధించినా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios