Asianet News TeluguAsianet News Telugu

ధోనీ కూడా మనిషే కదా.. గంగూలీ మద్దతు

చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు.  ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా  రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ తన టెంపర్ కోల్పోయిన సంగతి తెలిసిందే

Sourav Ganguly on MS Dhoni's on-field outburst at umpires: Everyone is human
Author
Hyderabad, First Published Apr 13, 2019, 11:03 AM IST


చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు.  ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా  రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ తన టెంపర్ కోల్పోయిన సంగతి తెలిసిందే. మిస్టర్ కూల్ గా అందిరిచేతా పిలిపించుకునే ధోనీలో అంత కోపం చూసి అందరూ షాకయ్యారు. 

ధోని అలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ...ప్రతి ఒక్కరూ ధోనిపై అసహనం వ్యక్తం  చేశారు. ‘భారత క్రికెట్‌లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మైదానంలో దుందుడుకుగా, అవమానకర రీతిలో ప్రవర్తించినప్పటికీ.. నిర్వాహకులు కేవలం మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో సరిపెట్టి సిగ్గు లేకుండా అమిత ఉదారత ప్రదర్శించారంటూ దిగ్గజ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాత్రం ధోనికి అండగా నిలిచాడు. ‘ ప్రతి ఒక్కరూ మనుషులే కదా. తనలో పోటీతత్త్వం ఉంది. ఇది నిజంగా ఓ విచిత్రమైన సందర్భం’ అంటూ గంగూలీ మద్దతుగా నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios