న్యూజిలాండ్ ని ఓడించి, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత్. ట్రోఫీ నిర్వాహక దేశం అయ్యి ఉండీ బహుమతి ప్రదానోత్సవానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్కరూ హాజరవలేదు. దీనిపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు.
పీసీబీపై షోయబ్ అక్తర్ ఆగ్రహం: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ గెలుపు తర్వాత పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తన దేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ను ఆయన విమర్శించారు. పీసీబీని ఎగతాళి చేశారు. ఫైనల్లో బోర్డు లేదా జట్టు సభ్యుడు దుబాయ్లో కనిపించకపోవడంతో అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ ఆగ్రహం
భారత్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ తన X ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. టీమ్ ఇండియా విజయం గురించి మాట్లాడాడు. అక్తర్ తన వీడియోలో మాట్లాడుతూ.. “భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ నుండి ఎవరూ ఫైనల్కు చేరుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన వ్యక్తి కూడా అక్కడ లేడు. ట్రోఫీ ఇవ్వడానికి ఎవరూ రాలేదు. హోస్ట్ దేశంగా ఇది చాలా తప్పు” అని అన్నారు.
చాలా కాలం తర్వాత ఐసీసీ టోర్నమెంట్ను నిర్వహించిన పాకిస్తాన్
చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. భారత్ పాక్కు వెళ్లడానికి నిరాకరించింది. ఆ తర్వాత టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్కు మార్చారు. భారత్ తన మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. పాకిస్తాన్ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ కూడా పాక్ చేజారిపోయింది. పొరుగు దేశం తిరిగి రావడానికి భారత్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు పరువు ప్రపంచం ముందు పోయింది. ఎక్కడా ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్వయంగా దిగ్గజ క్రికెటర్లు వారిని విమర్శిస్తున్నారు.